Thursday, April 25, 2024

అమ్మవారి డాలర్‌ టెంపుల్‌

అమ్మవారి కోసం డాలర్‌ టెంపుల్‌ ఏర్పాటు చేశారు. లక్షల రూపాయలు విలువ చేసే డాలర్లతో అమ్మవారిని అలకరించారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌ లో ఈ అమ్మవారు కొలువై ఉన్నారు. గాంధీనగర్‌ పరిధిలోని రూపాల్‌ గ్రామంలో ఉన్న వరదాయిని మాత ఆలయం చాలా ప్రసిద్ధి. ఏటా ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. గుజరాత్‌ నలమూలల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ప్రతీ ఏడాదిలాగే.. ఈ ఏడాది అమ్మవారిని డాలర్ల మధ్య అలకరించారు. యూఎస్‌ భక్తురాలు 11,500 డాలర్లను అమ్మవారికి కానుకగా ఇచ్చారు. వీటి విలువ దేశ కరెన్సీలో రూ.2.50లక్షలు. ఈ డాలర్ల తోనే అమ్మవారిని పూజారులు అలంకరించారు. ఆలయ ప్రాంగణమంతా.. డాలర్లతోనే తోరణాలు కట్టారు. దీంతో వరదాయిని మాతా దేవాలయం ఈ ఏడాది డాలర్‌ టెంపుల్‌గా దర్శనం ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement