Friday, May 17, 2024

తిరుమ‌ల‌లో కొన‌సాగుతున్న భ‌క్తుల ర‌ద్దీ…

క‌లియుగ ప్రత్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు తిరుమ‌ల‌కు పోటెత్తారు. కొండపై 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండ‌గా.. వీరికి ద‌ర్శ‌నానికి 12 గంటల సమయం పడుతోంది. బుధవారం స్వామివారిని 68,469 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.14 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 27,025 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement