Friday, July 26, 2024

ప్రజలందరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలి

తిరుమల, ప్రభన్యూస్‌ : ప్రజలందరు వ్యాక్సిన్‌ వేసుకుని కరోనా నుంచి రక్షణ పొందాలని తెలంగాణ గవర్నర్‌ తమిళ సై తెలిపారు. ఆదివారం ఉదయం ఆమె తిరుమల శ్రీవారిని దర్శిం చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఆమె విలేకరు లతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనం చాలా అద్బుతంగా జరిగిం దని, కరోనా నుంచి ప్రజలకు విముక్తి కలగాలని స్వామివారిని ప్రార్దించానని తెలిపారు. మధ్యాహ్నం అమీత్‌ షా నేతృత్వంలో జరగనున్న సదరన్‌ జోనల్‌ సమావేశంలో పాల్గొన బోతున్నాని, ఈ సమావేశం అనంతరం ఆంతర్‌ రాష్ట్ర సమస్యలపై చర్చించ నున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement