Friday, May 3, 2024

విజయవాడలో జాంబిరెడ్డి టీం సందడి

విజయవాడలో జాంబిరెడ్డి చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ జాంబిరెడ్డి ని ప్రేక్షకులు విశేషంగా ఆదరించారన్నారు. ఈనెల 26 వ ఆహా ఓటిటి లో రిలీజ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రమోషన్ లో భాగంగా విజయవాడకు వచ్చామని రాయలసీమ బ్యాక్ గ్రౌండ్ లో జాంబీస్ లాంటి కామెడీ,హార్రర్ చిత్రం చేశామని త్వరలోనే జాంబిరెడ్డి 2 సినిమా ని తీస్తామని అన్నారు.

ఇక జాంబి రెడ్డి హీరో తేజ మాట్లాడుతూ … కరోనా తరువాత జాంబిరెడ్డి రిలీజ్ అయ్యింది. తొలిసినిమా విజయం సాధించడం సంతోషంగా ఉంది. సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. సినిమా చూడని వారికోసం ఆహా లో రిలీజ్ చేస్తున్నాము. టాలీవుడ్ లో మొదటిసారిగా జాంబీ స్ ని డైరెక్టర్ పరిచయం చేశారు. కరోనా కారణంగా చాలా చిత్రాలు రిలీజ్ కాకుండా ఆగిపోయాయి. చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకవు అనే వాదన అబద్ధం. జాంబిరెడ్డి ని 500 థియేటర్స్ లో రిలీజ్ చేసామన్నారు. జాంబిరెడ్డి సినిమా 15 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుత పరిస్థితులలో ఓ టి టి ప్లాట్ ఫామ్స్ వలనే చిత్రాలకు ఆదాయం వస్తున్నాయి. జాంబిరెడ్డి హిట్ తో నాపై బాధ్యత పెరిగింది. సూపర్ గుడ్ ఫిలిమ్స్ తో కలిసి ఇష్క్ అనే చిత్రం చేస్తున్నాను. త్వరలోనే ఆ సినిమా కూడా రిలీజ్ కానుందని తేజా చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement