Wednesday, April 24, 2024

తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన హీరో కార్తీక్

తమిళ సీనియర్ హీరో కార్తీక్ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు. శ్వాస సంబంధిత సమస్యల కారణంగా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు. ఇటీవల ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. ఆయన ‘మనిద ఉరిమై కట్చి’ అనే పార్టీ స్థాపించి రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నాడు. తమిళనాడులో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే-BJP కూటమికి మద్దతు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఇంటికి వచ్చిన ఆయన.. శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కాగా ప్రస్తుతం కార్తీక్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement