Friday, May 3, 2024

మేజ‌ర్ పై రామ్ నాథ్ కోవింద్ ప్ర‌శంస‌లు.. ఆనందంలో అడివిశేషు

శశి కిరణ్ తిక్క మేజ‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. సూపర్ స్టార్ మహేశ్ బాబు GMB ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, A+S మూవీస్ సంయుక్తంగా నిర్మించారు. మేజర్‌లో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కూడా కీలక పాత్రల్లో నటించారు. కాగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ టైటిల్ పాత్రలో హీరో అడివి శేష్ జీవించారు. పాన్ ఇండియా ఫిల్మ్ గా విడుదలైంది ఈ మూవీ. ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. మేజర్ భారీ బ్లాక్ బస్టర్ కావడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఆర్మీ సిబ్బంది, రాజకీయ నాయకులు, సినీ ప్రేక్షకులు తదితర అన్ని వర్గాల ప్రజలను ఈ చిత్రం ఆకట్టుకుంది. అందరి నుంచి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా హీరో అడివి శేష్ కు భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుండి ఆహ్వానం అందుకున్నాడు. ఈ సందర్భంగా 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌ను రూపొందించినందుకు శేష్‌ని అభినందించారు. సినిమా అపూర్వ విజయం సాధించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఆశీర్వదించారు. ఇది అతిపెద్ద విజయంగానూ, మేకర్స్‌కి గర్వకారణంగానూ ఉంటుందని ప్రశంసలు కురిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement