Monday, April 29, 2024

చరణ్-శంకర్ మూవీకి చిక్కులు..

రామ్ చరణ్-శంకర్ మూవీ ఇప్పట్లో ప్రారంభమయ్యేట్లు లేదు. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు నిరాశ ఎదురయ్యేలా ఉంది. తాజా పరిణామాలు చూస్తుంటే ఈ మూవీ ఇప్పట్లో సెట్స్‌పై వచ్చేల కనిపించడం లేదు. కాగా శంకర్‌ ఇప్పటికే కమల్‌ హాసన్‌తో ఇండియా 2 మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ ఈ షూటింగ్‌ సెట్‌లో అగ్నిప్రమాదం జరగడం, ఈ ప్రమాదంలో కొంతమంది సిబ్బంది ప్రాణాలు కోల్పోవడంతో ఈ వ్యవహరం కోర్టు దాకా వెళ్లింది. దీంతో ఈ మూవీ మేకర్స్‌ నష్టపరిహారాలు చెల్లించడం కూడా జరిగింది. దీంతో ఇండియన్ 2 మూవీ అక్కడితో ఆగిపోయింది. మళ్లీ కొంత గ్యాప్ తర్వతా షూటింగ్ ప్రారంభమవుతుందని అంతా భావించారు. కాని ఇప్పటి వరకు ఏ అప్ డేట్ రాలేదు.

నిర్మాత దిల్ రాజు తన నిర్మాణ సంస్థలో ఇప్పటివరకు 49 సినిమాలు తీశారు. ఇప్పుడు తీయబోయే 50 వ సినిమాను ప్యాన్ ఇండియా రేంజ్ లో తీయాలని ప్లాన్ వేశాడు. అందులో భాగంగానే చరణ్-శంకర్ మూవీని ఫైనల్ చేశాడు. అనుకున్నట్లుగానే దిల్‌ రాజు నిర్మాణంలో చెర్రీ మూవీకి శంకర్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం, దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడటం చకచకా అయిపోయాయి.

ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ అయ్యాక చరణ్-శంకర్ మూవీ ప్రారంభమవుతుందని అంతా అనుకున్నారు. కాని ఈ లోపు ఇండియాన్2 ను పక్కన పెట్టి చరణ్‌ మూవీ ప్లాన్‌ చేస్తుండటంతో లైకా ప్రొడక్షన్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లినట్లు సమాచారం. తాము కేటాయించిన 230 కోట్ల రూపాయల బడ్జెట్‌లో ఇప్పటి వరకు రూ. 180 కోట్లు ఖర్చు పెట్టించిన డైరెక్టర్‌ శంకర్‌ ఈ సినిమాను పూర్తి చేయకుండానే వేరే కొత్త ప్రాజెక్ట్‌కు వెళ్లడం సరికాదని కోర్టుకు తెలిపింది. దీంతో ఈ వ్యవహరం కాస్తా ముదిరెలా కనిపిస్తోంది. చరణ్-శంకర్ మూవీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రారంభం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement