Tuesday, May 7, 2024

నాతో నేను.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేసిన విజ‌యేంద్ర‌ప్ర‌సాద్

సాయికుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం నాతో నేను. గతేడాది గాలివాన వెబ్‌ సిరీస్‌లో నటించిన సాయి కుమార్.. ఈ ఏడాది ధనుష్‌ నటించిన సార్‌ చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు. సాయికుమార్ చాలా రోజుల తర్వాత లీడ్ రోల్‌లో సినిమా చేస్తుండటంతో ఎలాంటి స్టోరీతో రాబోతున్నాడోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు. కాగా ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని పాపుల‌ర్ రైట‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ తో రిలీజ్ చేయించారు. ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. ఆ ప్రయాణం సరైన సమయంలో స్పష్టంగా కనిపిస్తుంది.. అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. పోస్టర్‌లో ఓ వైపు సీరియస్‌ లుక్‌లో సాయికుమార్‌, మరోవైపు పిల్లాడు కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి సంతికుమార్‌ తుర్లపాటి కథ, సంభాషణలు, స్క్రీన్‌ ప్లే అందిచడంతోపాటు దర్శకత్వం వహిస్తున్నాడు. సత్య కశప్‌ సంగీతం అందిస్తున్నాడు.ఎల్లలు బాబు టంగుటూరి సమర్పణలో శ్రీ భవ్‌నేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ప్రశాంత్‌ టంగుటూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆదిత్య ఓం, భద్రమ్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement