Monday, April 29, 2024

కాకినాడలో ముజిగల్‌ అత్యాధునిక మ్యూజిక్‌ అకాడమీ ప్రారంభం

హైదరాబాద్: భారతదేశపు అతిపెద్ద మ్యూజిక్‌ ఎడ్యుకేషన్‌ ప్లాట్‌ఫామ్‌, ముజిగల్‌ తమ 7వ అత్యాధునిక సంగీత అకాడమీని కాకినాడ (ఆంధ్రప్రదేశ్) లో ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగ గీత, కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే డి చంద్రశేఖర్ రెడ్డి, స రి గ మ తెలుగు సీజన్ 13వ‌ విజేత, గాయకుడు యశస్వి కొండేపూడి, ముజిగల్ ఫౌండర్ డాక్టర్ లక్ష్మీనారాయణ ఏలూరి ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా ముజిగల్‌ అకాడమీ ప్రారంభం గురించి ముజిగల్‌ ఫౌండర్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణ ఏలూరి మాట్లాడుతూ… సంగీత విద్యను అందరికీ చేరువ చేయాలనే మహోన్నత లక్ష్యంతో ముజిగల్‌ అకాడమీ తీర్చిదిద్దామన్నారు. అభ్యాసకులకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కేంద్రాన్ని తమకు దగ్గరలో అందిస్తుందన్నారు. సంగీతంలో అత్యుత్తమ అభ్యాసం, బోధన అనుభవాలను ఈ కేంద్రం అందించనుంది. భారతీయ పాశ్చాత్య సంగీతంలో విస్తృత శ్రేణి కోర్సులను ఇది అందిస్తుందన్నారు.

ఈ కోర్సులను నిష్ణాతులైన సంగీత అధ్యాపకులు బోధించనున్నారన్నారు. వీటితో పాటుగా అభ్యాసకులను లక్ష్యంగా చేసుకుని ఓ నిర్మాణాత్మక కరిక్యులమ్‌ (బోధనాంశాలు), పీరియాడిక్‌ ఎస్సెస్‌మెంట్స్‌, సర్టిఫికేషన్‌, సౌకర్యవంతమైన ఫీజు చెల్లింపు ప్లాన్స్‌, సుశిక్షితులైన అధ్యాపకులను అందుబాటులో ఉంచామని అన్నారు. భారతదేశంతో పాటుగా యుఎస్‌ఏ, యుకె, ఆస్ట్రేలియా, యుఏఈలలో 10వేల మంది విద్యార్ధులకు 400కు పైగా సుశిక్షితులైన సంగీత టీచర్లు మద్దతు అందిస్తున్నారన్నారు. ఇప్పటికే 40వేల తరగతులు విజయవంతంగా పూర్తయ్యాయన్నారు. సుశిక్షితులైన టీచర్లు, షాప్‌ –ఫ్రంట్‌ తో చుట్టుపక్కల సంగీత అకాడమీలను సంపూర్ణం చేయడం, పునర్నిర్మించడం చేస్తుందన్నారు. అన్ని వయసులు, వర్గాల అభ్యాసకులను ముజిగల్‌ ఆహ్వానిస్తోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement