Tuesday, July 23, 2024

Vishwak Sen | సెన్సార్ పూర్తి చేసుకున్న “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అప్‌కమింగ్ యాక్షన్ డ్రామా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఈ నెల మే 31న థియేటర్లలో విడుదలకు సిద్దంగా ఉంది. కాగా, తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. సెన్సార్ బోర్డు వారు చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ను అందించారు.

ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. సాయికుమార్, గోపరాజు రమణ, అయేషాఖాన్, హైపర్ ఆది తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement