Tuesday, May 14, 2024

Nainisha Roy : క‌మిట్మెంట్ అడిగారు…బ్ల‌డ్ అమ్ముకుని బ‌తికా

బెంగాలీకి చెందిన నైనిషా రాయ్ తెలుగు ఇండస్ట్రీ మీద ఆసక్తితో ఇటు వచ్చారు. ‘బ్రహ్మముడి’ సీరియల్ చూసినవారు నైనిషను గుర్తు పట్టేస్తారు. వరుస పెట్టి సీరియల్స్ చేసిన ఈ నటి ఇండస్ట్రీలో తను ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి మాట్లాడారు. కుటుంబానికి కూడా దూరమైన నైనిష తాజా ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్న విషయాలు అందర్నీ షాక్‌కి గురి చేశాయి.

- Advertisement -

బ్రహ్మముడి అనే సీరియల్‌లో అప్పు పాత్రతో నైనిష మంచి మార్కులు కొట్టేసారు. కలిసి ఉంటే కలదు సుఖం, వంటలక్క, భాగ్య రేఖ, ఇంటిగుట్టు, హంసగీతం, శ్రీమంతుడు వంటి సీరియల్స్‌లో నటించారు. కాగా ఈ నటి ఇండస్ట్రీలో తను ఎదుర్కొన్న ఇబ్బందులను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఇండస్ట్రీకి వెళ్తాను అంటే ఏ ఫ్యామిలీ అమ్మాయిలను యాక్సెప్ట్ చేయదని అన్నారు నైనిష. అందుకే తన కుటుంబం తనకు దూరమైందని చెప్పారు. ఇండస్ట్రీలో కమిట్ మెంట్ అనేది ఎక్కువగా ఉందని.. ఒక ప్రాజెక్టు విషయంలో రెండు రోజుల్లో షూటింగ్ అనగా మేనేజర్ కమిట్ మెంట్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పాడని నైనిష అన్నారు. తను కుదరదు అన్నందుకు తనను చాలా ఇబ్బందికి గురి చేసారని చెప్పారు. తన పరిస్థితి దారుణంగా మారిపోయి చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని .. ఆఖరికి తినడానికి తిండి లేక బ్లడ్ డొనేట్ చేసి వచ్చిన డబ్బులతో కడుపు నింపుకున్నానంటూ నైనిష చెప్పిన విషయాలు సంచలనం రేపుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement