Tuesday, April 30, 2024

ఆదిపురుష్ థియేట‌ర్ లో వాన‌రం.. సాక్షాత్త్ హ‌నుమంతుడే అంటోన్న జ‌నం

ఆదిపురుష్ రిలీజ్ అయిన ప్ర‌తి థియేట‌ర్ల‌లో హ‌నుమంతుడి కోసం ఒక సీటుని కేటాయించింది చిత్ర యూనిట్. హనుమంతుడు వచ్చి సినిమా చూస్తాడనే నమ్మకంతో ఇలా ఒక సీటు విక్రయించకుండా వదిలేయాలని నిర్ణయించారు. తాజాగా ఆదిపురుష్ ప్రదర్శితమవుతున్న ఓ థియేటర్‌లోకి వానరం వచ్చింది. అలానే కాసేపు స్క్రీన్‌ వైపు చూసింది. దాంతో హనుమంతుడి వచ్చి సినిమా చూస్తున్నాడంటూ ఆ థియేటర్‌లోని ప్రేక్షకులు జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. ప్రస్తుతం ఆ వానరం సినిమా చూసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రామాయాణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఓ రౌత్ దర్శకత్వం వహించాడు. స్టార్ హీరో ప్రభాస్ రాముడి పాత్ర పోషించగా.. హీరోయిన్ కృతిసనన్ సీతగా కనిపించనుంది. లంకాధిపతి రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

https://twitter.com/letscinema/status/1669565043502112768
Advertisement

తాజా వార్తలు

Advertisement