Wednesday, May 1, 2024

మొన్న కొడుకు….ఈరోజు వార్త… నటి కవిత ఇంట విషాదం

ఇటీవల కరోనా మహమ్మారి కారణంగా సినీ రాజకీయ ప్రముఖులు ఎంతోమంది మృతి చెందారు. అయితే తాజాగా సీనియర్ నటి కవిత భర్త కన్నుమూసినట్లు తెలుస్తోంది. మొన్నటికి మొన్న ఆమె కుమారుడు కూడా కరోనాతో మృతి చెందారు. జూన్ 15న ఆమె కొడుకు సంజయ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. మొదట అతను ఇంట్లో క్వారంటైన్ లో ఉన్నారు. అయితే ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తూ ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కడే సంజయ్ మృతిచెందారు.

కాగా ఇప్పుడు కవిత భర్త దశరథ్ రాజ్ కరోనా బారినపడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా కన్నుమూసినట్లు సమాచారం. ఇక కవిత పదకొండేళ్ల వయసులో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి 350కి పైగా సినిమాల్లో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement