Friday, May 3, 2024

AP : మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభ

ఇవాళ మేదరమెట్లలో వైసీపీ సిద్ధం 4వ సభ నిర్వహిస్తుంది. అయితే మేదరమెట్లలో వైసీపీ చివరి సిద్ధం సభ కావడంతో భారీ ఏర్పాట్లు చేశారు. సిద్ధం సభ ద్వారా వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్.

- Advertisement -

ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం తాడేపల్లి లోని తన నివాసం నుండి హెలిక్రాఫ్టర్ ద్వారా బయలుదేరనున్నారు. 3.35 గంటలకు సిద్ధం సభా వేదిక వద్దకు చేరుకోనున్న సీఎం జగన్. 3.40 నుంచి 5.10 గంటల వరకు సిద్ధం సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. 5.30 సభా పూర్తయిన అనంతరం సభాస్థలి నుంచి బయలుదేరి 6.00 గంటలకు తాడేపల్లి లోని తన నివాసానికి తిరిగి చేరుకోనున్నారు సీఎం జగన్.ఈ సభలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్న సీఎం జగన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement