Friday, May 3, 2024

వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నివాసాల్లో – ఈడీ సోదాలు

వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన నెల్లూరులోని నివాసంతో పాటు..ఢిల్లీ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు జ‌రిపారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ నుంచి వెళ్లిన ఈడీ అధికారులు ఈ సోదాలను నిర్వహిస్తున్నారు. దాదాపు 40కి పైగా లొకేషన్లలో రెయిడ్స్ కొనసాగుతున్నాయి. హైదరాబాదులో 20 చోట్ల సోదాలు జరుగుతుండగా… ఏపీలోని నెల్లూరులో కూడా రెయిడ్స్ జరుగుతున్నాయి. ఈ స్కామ్ లో మాగుంటపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీలోని వైన్ షాపుల్లో కొన్నింటిని మాగుంటకు చెందిన లిక్కర్ కంపెనీలు చేజిక్కించుకున్నాయని ఈడీ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మాగుంట నివాసాల్లో సీబీఐ సోదాలను నిర్వహించింది. మరోవైపు మాగుంటతో పాటు మరికొందరు నేతల హస్తం కూడా ఈ స్కాంలో ఉందని ఈడీ ఆరోపిస్తోంది. త్వరలోనే వీరి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement