Friday, April 19, 2024

కోనసీమలో చిచ్చుపెట్టింది వైసీపీనే : పవన్ కల్యాణ్

కోనసీమలో చిచ్చు పెట్టింది వైసీపీనే అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అమలాపురంలో అల్లర్లపై ఆయన స్పందించారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… వైసీపీ ఉద్దేశం అల్లర్లు కోరుతున్నట్లు ఉందన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే పోలీసులు నానా హడావిడి చేస్తారు.. మంత్రి ఇంటి మీద దాడి జరిగితే యంత్రాంగం ప్రేక్షకపాత్ర పోషించేలా చేశారన్నారు. పోలీసులను అప్రమత్తం చేయకపోవడం ముందస్తు ప్రణాళికే అన్నారు. దాడులను అడ్డుకోవడానికి అవకాశమున్నా.. చేయలేదన్నారు. ఇక్కడ భావోద్వేగాలను రెచ్చగొట్టడానికే 30రోజులు గడువు ఇచ్చారన్నారు. ప్రజల భావోద్వేగాలు తెలిసి యంత్రాంగం సైలెంట్ గా ఉందన్నారు. అల్లర్లకు జనసేనను బాధ్యులను చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. అంబేద్కర్ ను రాజకీయాలో కోసం వాడుకుంటున్నారని.. వాడుకొని వదిలేస్తున్నారన్నారు. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలని ఏ ప్రభుత్వమూ అనుకోవడం లేదన్నారు. వైసీపీకి అంబేద్కర్ మీద ప్రేమ ఉంటే అంబేద్కర్ కోరుకున్న ఎస్సీ సబ్ ప్లాన్ ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement