Sunday, May 19, 2024

AP | వైసీపీ కుట్రలు, కుతంత్రాలను సమర్థంగా ఎదుర్కోవాలి : పవన్

ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. సీఎం జగన్, చంద్రబాబు, పవన్ ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ కూటమి కార్యకర్తలకు కీలక దిశానిర్దేశం చేశారు. ఈ 40 రోజులు చాలా ముఖ్యమైనవని టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు.

ఎన్డీయే కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. వైసీపీ కుట్రలు, కుతంత్రాలను సమర్థంగా ఎదుర్కోవాలని సూచించారు. పోలింగ్ ముగిసే వరకు మూడు పార్టీల కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయాలన్నారు. పిఠాపురంలో మా గెలుపు తథ్యమని పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే రోల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. వర్మ త్యాగం చాలా గొప్పదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement