Sunday, April 28, 2024

AP : గెలుపు ల‌క్ష్యంగా ప‌ని చేయండి… కార్య‌క‌ర్త‌ల‌కు జ‌గ‌న్ పిలుపు

ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని.. తమ ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని తనను కలిసిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగ‌న్. కర్నూలు జిల్లా పత్తికొండ స్టే పాయింట్‌ వద్ద పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, కళ్యాణదుర్గం, కర్నూలు జిల్లా వైసీపీ నేతలు క‌లిశారు.

- Advertisement -

వారితో సుమారు గంటన్నరకు పైగా గడిపారు. .. పలువురు పార్టీ నేతలను, సీనియర్‌ కార్యకర్తలను పలకరిస్తూ.. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఎలా పనిచేయాలన్నదానిపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
చేరిక‌లు ..
మరోవైపు.. స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో పలువురు నేతలు చేరారు.. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.. కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో.. వైసీపీలో చేరారు పలువురు నేతలు.. వైసీపీ కండువా కప్పుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement