Friday, May 17, 2024

పాముకాటుతో మహిళ మృతి.. ఎన్టీఆర్ జిల్లా ఘ‌ట‌న‌

ప్రభ న్యూస్ : ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం వెలది కొత్తపాలెం గ్రామంలో పాముకాటుతో మహిళ మృతి చెందింది. వెలది కొత్తపాలెం గ్రామానికి చెందిన కామసాని శివపార్వతి (50) పొలంలో చెత్త వేరేందుకు వెళ్ళగా రక్తపింజరు పాము కాటు వేసింది. విశ‌యం తెలుసుకున్న కుటుంబ స‌భ్యులు వైద్యం కోసం నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిన‌ట్లు వైద్యులు దృవీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement