Tuesday, April 30, 2024

AP: గ‌తం కంటే ఎక్కువ స్థానాల‌లో గెలుస్తాం – మంత్రి పెద్దిరెడ్డి

వచ్చే ఎన్నికల్లో 151 కంటే ఎక్కవ స్థానాలు గెలుస్తాం అంటూ ధీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. రేపు రాప్తాడులో జ‌రగ‌బోయే వైసీపీ సిద్ధం సభ ఏర్పాట్లను ప‌రిశీలించిన అనంత‌రం అనంతపురం వ‌చ్చిన ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రాప్తాడు సిద్ధం సభ అనంతరం వైసీపీ ఎన్నికల ఊపు అందుకుంటుంద‌న్నారు.

అందుకే ప్రతిష్టాత్మంగా తీసుకుని సభ విజయవంతానికి కృషి చేస్తున్నాం అన్నారు. రాబోయే ఎన్నికలకు పూర్తిగా వైసీపీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయ‌ని, . ఈ సభతో రాష్ట్రంలో మూడు సిద్ధం సభలు పూర్తి అవుతాయ‌ని అన్నారు. త్వరలో పల్నాడులో మరో సభ ఉంటుందన్నారు. గత ఎన్నికల కంటే అత్యధిక స్థానాలు సాధించేందుకు ఈ సభ ఊతం ఇస్తుంద‌న్నారు . రాష్ట్రంలో అతి పెద్ద సభగా రాప్తాడు సిద్దం సభ నిలుస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement