Friday, May 17, 2024

భార్య‌ను చంపి : ఆపై భ‌ర్త ఆత్మ‌హ‌త్య

ఓ భ‌ర్త త‌న భార్యపై అనుమానంతో ఆమెను చంపి… త‌నూ ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే…. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రు గ్రామానికి చెందిన యేసుబాబు భార్యపై అనుమానంతో తరచూ వేధించేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల భార్య మనీషాపై కర్రతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మనీషాను కుటుంబ సభ్యులు పొన్నూరు దవాఖానలో చేర్చించారు. అక్క‌డ చికిత్స పొందుతూ ఆమె సోమవారం మరణించింది. భార్య చ‌నిపోయింద‌న్న వార్త తెలియ‌గానే.. ఏసుబాబు ఇంట్లో ఎవరూ లేని స‌మ‌యంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పొన్నూరు రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement