Friday, May 17, 2024

ఎన్టీఆర్ ను కూల‌దోసిన‌ప్పుడు బాల‌కృష్ణ ఏం చేశారు… జోగి ర‌మేష్

ఎన్టీఆర్ ను కూల‌దోసిన‌ప్పుడు బాల‌కృష్ణ ఏం చేశార‌ని ఏపీ మంత్రి జోగి ర‌మేష్ ప్ర‌శ్నించారు. మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ… ఎన్టీఆర్ ను ఈ జాతి నుంచి దూరం చేసిందెవ‌ర‌ని అన్నారు. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచిందెవ‌ర‌ని ప్ర‌శ్నించారు. పార్టీని, ట్ర‌స్ట్ ను లాక్కుని, సీఎం పీఠంపై మీ బావ కూర్చోలేదా.. అప్పుడు బాల‌కృష్ణ ఏం చేశార‌ని అడిగారు. చంద్ర‌బాబుకు బుద్ది చెప్పండన్న ఎన్టీఆర్ చివ‌రి కోరిక‌ను మీరు నెర‌వేర్చ‌లేద‌న్నారు. ఎన్టీఆర్ ను కూల‌దోసిన‌ప్పుడు బాల‌కృష్ణ న‌వ్వుతూ ఆనందించార‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement