Saturday, April 20, 2024

ప.గో. జిల్లాలో ఇంజినీరింగ్ విద్యార్థి కిడ్నాప్, దారుణహత్య

పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం దగ్గర ఇంజినీరింగ్ విద్యార్థి కిడ్నాప్ అయ్యాడు. అనంతరం కాసేపటికే హత్యకు గురయ్యాడు. కొయ్యల వంశీ(24) అనే యువకుడు మంగళవారం రాత్రి 11గంటల సమయంలో కిడ్నాప్‌కు గురయ్యాడు. ఈ నేపథ్యంలో కిడ్నాపర్లు 50లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో యువకుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కొద్దిసేపటికే హత్యకు గురయ్యాడు.

అయితే ఈ కిడ్నాప్ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతోనే తమ కుమారుడిని హత్య చేశారని యువకుడి బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా అసలు ఈ ఘటనకు ప్రేమ వ్యవహారం కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ వార్త కూడా చదవండి: జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి

Advertisement

తాజా వార్తలు

Advertisement