Wednesday, May 1, 2024

AP CM : రేణిగుంట విమానాశ్రయంలో సీఎం జగన్ కు ఘనస్వాగతం

తిరుపతి సిటీ, జూలై 4, ప్రభ న్యూస్ : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో కాసేపటి క్రితం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘనస్వాగతం లభించింది. వీరి వెంట రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు, రాష్ట్ర వైద్య శాఖ మంత్రి విడదల రజని ఉన్నారు.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇంఛార్జి మంత్రి నారాయణ స్వామి, రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ చక్రవర్తి, సిపాయి సుబ్రమణ్యం, తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, జెసి డి కె బాలాజీ, నగరపాలక సంస్థ కమిషనర్ హరిత స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, సూల్లురు పేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నేదురుమల్లి రాంకుమార్, తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ సిరాజ్ భాషా, ఆర్డీవోలు రామారావు, కనక నరసరెడ్డి తదితరులు, ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం చిత్తూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనుటకు ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో బయల్దేరి వెళ్ళారు. వీరి వెంట ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సిదిరి అప్పల రాజు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement