Monday, April 29, 2024

AP: స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి ప్రదాత… జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు

కశింకోట,జనవరి12(ప్రభ న్యూస్): ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక నాయకుడు, రామకృష్ణ పరమహంస ప్రియశిష్యుడు, రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడైన స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తిప్రధాత అని జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు అన్నారు. శుక్రవారం మండలకేంద్రమైన కశింకోట మెయిన్ రోడ్డులో వివేకానంద విగ్రహానికి బుల్లిబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బుల్లిబాబు మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రేమించి, నిద్రాణమై ఉన్న భారతీయ సమాజాన్ని జాగృతం చేసి, భారతీయ సంస్కృతీ సంప్రదాయాల విశిష్టతను అమెరికా, ఇంగ్లండ్‌ తదితర పాశ్చాత్య దేశాలలో చాటిచెప్పిన భారతమాత ముద్దుబిడ్డ స్వామి వివేకానంద అని కొనియాడారు. యువత సాధికారత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. స్వర్గీయ వాడపల్లి రాంప్రసాద్ జ్ఞాపకార్థం వారి కుమార్తె హారిక వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. వివేకానంద విగ్రహానికి శాస్త్రి మాస్టర్ నివాళ్లు అర్పించి విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా అతిధిని బుల్లిబాబును నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement