Thursday, April 25, 2024

66 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం..

ఏపీ పోలీస్‌ శాఖ గంజాయిపై ఉక్కుపాదం మోపుతోంది. గంజాయి నిల్వలు, గంజాయి సాగును ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తూ వస్తుంది. నిన్నటి వరకు కోట్లాది రూపాయల గంజాయిని ధ్వంసం చేయగా.. ఈరోజు గంజాయి సాగు పంటలపై దాడులకు దిగారు పోలీసులు. విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటలను పోలీసులు ధ్వసం చేశారు. ఎస్‌ఈజీ, పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌ చేపట్టారు. జామిగూడ, మెట్టగూడ, జడిగూడ, కింజరగూడ తర్పసింగిలో 66 ఎకరాల గంజాయి తొటలు ధ్వంసం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement