Friday, March 29, 2024

విజ‌య‌సాయి బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌పై విచార‌ణ వాయిదా

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కౌంటర్ దాఖలు చేశారు. అయితే వాదనలు వినిపించేందుకు విజయసాయి రెడ్డి న్యాయవాది కొంత సమయం కోరారు. దీంతో త‌దుప‌రి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.  విజ‌య‌సాయి బెయిల్ ర‌ద్దు అంశాన్ని కోర్టు నిర్ణయానికే వదిలేసింది సీబీఐ

కాగా, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్‌పై ఈ నెల 13న సీబీఐ మెమో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. విచక్షణ మేరకు, చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని కోర్టును సీబీఐ కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement