Friday, May 3, 2024

AP: గోరంట్లకు చేరుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి రాష్ట్ర ఆర్థిక మంత్రి

శ్రీ సత్య సాయి బ్యూరో నవంబర్ 30: (ప్రభన్యూస్) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి లు గురువారం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల చేరుకున్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లో భాగంగా వారు శ్రీ సత్య సాయి జిల్లా పర్యటనకు విచ్చేశారు.

ఈ సందర్భంగా వారికి శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వారు పాలసముద్రం వద్ద జరుగుతున్న నాసిన్ కు సంబంధించిన పనులను సమీక్షించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement