Monday, April 29, 2024

AP : ఇవాళ ఏపీలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ పర్యటన…

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు. విశాఖపట్నం, విజయవాడ, ఏలూరులో పలు కార్యక్రమాలు పాల్గొననున్నారు రాజ్‌నాథ్. మొదట విశాఖ చేరుకోనున్న ఆయన భారత్ రైజింగ్ పేరుతో జరగనున్న మేధావులతో సమావేశంలో పాల్గొంటారు.

ఈ సమావేశానికి సుమారు 600 మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేసింది బీజేపీ. ఇక, విశాఖ తర్వాత విజయవాడలో జరగనున్న బీజేపీ కోర్ కమిటీ భేటీలో పాల్గొంటారు రాజ్‌నాథ్‌. ఆ తర్వాత ఏలూరు వెళ్లనున్నారు. అక్కడ బీజేపీ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొననున్నారు. అయితే, ఏపీలో ఇప్పటికే అధికార వైసీపీతో పాటు.. ప్రతిపక్ష టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థులను ప్రకటిస్తూ.. ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. రాజ్‌నాథ్‌ సింగ్‌ పర్యటనతో బీజేపీ కూడా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement