Friday, May 3, 2024

రామయ్య బ్రహ్మోత్సవాలకు త‌ప్ప‌కుండా రావాలే.. సీఎం జ‌గ‌న్‌కు టీటీడీ ఈవో ఆహ్వానం

కడప (ప్ర‌భ న్యూస్‌): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం క‌డ‌ప జిల్లాలో ఈనెల 9 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించే ఒంటిమిట్ట కోదండ రామ స్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని టీటీడీ ఈవో కెఎస్ జవహర్ రెడ్డి ఆహ్వానించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో శుక్రవారం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చి ప్రసాదాలు అందజేశారు. కార్య‌క్ర‌మంలో డిప్యూటీ ఈవో శరమణ ప్రసాద్ పాల్గొన్నారు. కాగా, ఈ నెల 15వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 10 లోపు సీతారామ కళ్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి హాజరు కానున్న‌ట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement