Monday, April 29, 2024

Tributes – వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి – ఇడుపుల‌పాయ ఘాట్ వ‌ద్ద విజ‌య‌మ్మ నివాళి..

ఇడుపుల‌పాయ – దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ ఆర్ ఘాట్ వ‌ద్ద ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయి .. దివంగ‌త నేత‌కు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో పాటు ప‌లువురు రాయ‌కీయ ప్ర‌ముఖులు, అభిమానులు అంజ‌లి ఘ‌టిస్తున్నారు..

నేటి ఉద‌యం సమాధి వద్ద వైఎస్ఆర్ స‌తీమ‌ణి విజ‌య‌మ్మ‌, కుమార్తె ష‌ర్మిల లు నివాళి అర్పించారు.. అక్క‌డ జ‌రిగిన ప్ర‌త్యేక ప్రార్ధ‌న‌ల‌లో పాల్గొన్నారు.. వారితో పాటు షర్మిల కుమారుడు రాజారెడ్డి, కూతురు అంజలి కూడా శ్రద్ధాంజలి ఘటించారు. ఇక జ‌గ‌న్ మ‌రికొద్దిసేప‌టిలో ఇక్క‌డికి చేరుకున్నారు.. తండ్రి స‌మాధి వ‌ద్ద ఆయ‌న ప్ర‌త్యేక ప్రార్ధ‌న‌లు చేయ‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement