Friday, May 17, 2024

TTD | రేపు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా విడుదల

తిరుమల, ప్రభ న్యూస్‌ ప్రతినిధి : భక్తుల సౌకర్యార్ధం 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను శుక్రవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదేవిధంగా తిరుమల, తిరుపతిలో గదుల కోటాను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ వెబ్‌సైట్‌లో ముందస్తుగా దర్శన టికెట్లు, గదులను బుక్‌ చేసుకోవాలని కోరడమైనది. అదేవిధంగా 2024 ఫిబ్రవరి 16 న రథసప్తమి పర్వదినానికి సంబంధించిన శ్రీవారి సేవ స్లాట్లను ఈనెల 27న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. 18 నుంచి 50 ఏళ్ల వరకు వయోపరిమితి ఉన్నవారు మాత్రమే ఈ స్లాట్లను బుక్‌చేసుకునేందుకు అర్హులు.

అదేవిధంగా తిరుమల, తిరుపతిలో భక్తులకు స్వచ్ఛంద సేవ చేసేందుకు గాను 2024 జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన శ్రీవారిసేవ, నవనీతసేవ కోటాను ఈనెల 27న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు పరకామణిసేవ కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఈ సేవలను టీటీడీ వెబ్‌సైట్‌లో భక్తులు బుక్‌ చేసుకోవచ్చు.

- Advertisement -

27న బ్రేక్‌ దర్శనాలు రద్దు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 27వ తేదీ సోమవారం పరిపాలనా కారణాల వల్ల బ్రేక్‌ దర్శనాలను టీటీడీ రద్దుచేసింది. కావున 26వ తేదిన సిఫారసు లేఖలు స్వీకరించబోరు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాల్సిందిగా ఒక ప్రకటనలో కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement