Thursday, April 25, 2024

టీటీడీ అన్నదానం ట్రస్టుకు .. భారీ విరాళం


తిరుమల అన్నదానం ట్రస్టుకు రూ 1,00,10,116ల విరాళాన్నినెల్లూరుకు చెందిన కాంట్రాక్టర్‌, బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఏపీ చైర్మన్‌, భవాని కన్‌స్ట్రక్షన్స్‌ ఎండీ పంకజ్‌రెడ్డి అందజేశారు. సూళ్లూరుపేట శాసన సభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులు కిలివేటి సంజీవయ్యతో కలిసి దేవిరెడ్డి పంకజ్‌రెడ్డి – సరిత దంపతులు టీడీడీ ఈవో డాక్టర్‌ కెఎస్‌ జవహార్‌ రెడ్డిని తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో కలసి డీడీని అందించారు. అన్నదానం ట్రస్టుకు కోటి విరాళాన్ని అందించిన దాత పంకజ్‌రెడ్డి దంపతులను ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఈవో జవహర్‌రెడ్డిలు అభినందించారు. కాగా , పంకజ్‌రెడ్డి సోమశిల ఎస్‌ఈగా పనిచేసిన దివంగత దేవిరెడ్డి రామిరెడ్డి కుమారుడు కావడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement