Sunday, April 28, 2024

Tirumala: శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా ఇవాళ ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు. ఈ సందర్భంగా నేటి సాయంత్రం శ్రీరాములవారు హనుమంత వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు.

- Advertisement -

అదేవిధంగా, శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 18న శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమం వైభవోపేతంగా జరుగనుంది. శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు హనుమంత వాహనసేవ జరుగుతుంది. ఆ తరువాత రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కారణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. ఏప్రిల్ 18న రాత్రి 8 నుండి 9 గంటల నడుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement