Friday, May 3, 2024

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం – ముగ్గురు మృతి

నెల్లూరు –   ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం బద్వేలు జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

ఇక ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కొడవలూరు మండలం దామేగుంట గ్రామానికి చెందిన రెండు కుటుంబాలకు చెందిన వారు చెన్నైకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతోంది. ఆగివున్న కంటైనర్ ను వేగంగా ఇన్నోవా వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇక ఈ ప్రమాద విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలనికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స కోసం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది

Advertisement

తాజా వార్తలు

Advertisement