Thursday, April 25, 2024

KNL: సిరాలదొడ్డిలో విషాదం – చెరువులో పడి ముగ్గురు మృతి

కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు మండలం, సిరాలదొడ్డిలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఉతికేందుకు నీటి కుంట వద్దకు వెళ్లిన ముగ్గురు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందారు. మృతులు మరియమ్మ (28), సలోమి (25), లోకేష్ (3)గా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా విషాదంను నింపింది.


మృతుల్లో ఇద్దరు మహిళలు కాగా.. ఒక చిన్నారి ఉన్నారు. ఒకేసారి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు… సంఘటనాస్థలికి చేరుకున్నారు. గ్రామస్థుల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు. మృతికి గల కారణాలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement