Friday, May 17, 2024

శ్రీశైలం ఘటనలో గాయపడిన వారు బాగానే ఉన్నారు.. అన్ని విధాల శ్ర‌ద్ధ తీసుకుంటున్నాం: కలెక్టర్​

శ్రీశైలం ఘటనలో గాయపడిన భక్తులు ఆరోగ్యంగా ఉన్నారని, ఈ అంశంలో ప్రభుత్వం అన్ని విధాలా ప్రత్యేక శ్రద్ద తీసుకుందని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు వెల్లడించారు శుక్రవారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో ఆయ‌న మాట్లాడారు. శ్రీశైలంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన సంఘటనలో గాయపడిన కన్నడ భక్తులకు సంబంధించిన కుటుంబ సభ్యులతో కలెక్టర్ పి.కోటేశ్వర రావు, జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి మాట్లాడారు. గాయపడిన గోపాల్ కన్నడ భక్తుడు ఆరోగ్యంగా కోలుకొని డిశ్చార్జ్ కావడం జరిగిందని, మరొక వ్య‌క్తి శ్రీశైలపట్టు కుటుంబ సభ్యుల కోరిక మేరకు అతన్ని ప్రభుత్వ ఖర్చుతో, జిజిహెచ్ అంబులెన్స్ తో బెంగళూరులోని నిమ్హాన్స్ న్యూరో సర్జన్ హాస్పిటల్ కు రిఫర్ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement