Tuesday, May 7, 2024

YCP: గ్రాఫ్ బాగుంటేనే టికెట్.. ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పిన జగన్

గ్రాఫ్ బాగుంటేనే టికెట్ ఇచ్చేదని ఎమ్మెల్యేలకు సీఎం జగన్ తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేల మీటింగ్ లో ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పనితీరు బాగున్న ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తానని, పనితీరు బాగోలేని వారికి సీట్లు ఇవ్వలేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఎమ్మెల్యే గ్రాఫ్ పెంచుకోవాలని చెప్పారు. గ్రాఫ్ బాగోలేని వారిని కొనసాగించడం కుదరదన్నారు. గడపగడపకూ కార్యక్రమం వల్ల గ్రాఫ్ పెరుగుతుందని చెప్పారు. సర్వేల్లో అనుకూలంగా లేని వారిని కూడా కొనసాగించడం కుదరదని హెచ్చరించారు. ఇలాంటి వారికి టికెట్లు ఇవ్వడం వల్ల వారికీ నష్టం, పార్టీకి నష్టమని చెప్పారు. గడపగడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్షపై చర్చ సందర్భంగా ఆయన ఈ హెచ్చరికలు జారీ చేశారు.

ఏయే పథకాలు ప్రజలకు అందలేదో తెలుసుకోవాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించానలి సూచించారు. వచ్చే సమావేశానికి పనితీరును మెరుగుపరుచుకుని రావాలని అన్నారు. 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం బాగోలేదని… వారిని పిలిచి మాట్లాడతానని చెప్పారు. అందరూ కష్టపడి 175కి 175 సీట్లను గెలుచుకుందామని చెప్పారు. జులై 1 నుంచి జగనన్న సురక్ష కార్యక్రమం మొద‌ల‌వుతుంద‌ని, ఈ కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌జ‌ల‌కు సంపూర్ణంగా మంచి జ‌రిగేలా చూడాల‌న్నారు. సోషల్ మీడియా కూడా మనకు చాలా ముఖ్యమ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement