Sunday, April 28, 2024

AP: తండ్రిని, పిన్నిని హత్య చేసిన మొదటి భార్య కొడుకు ….!

బొండపల్లి(విజయనగరం ) పిబ్రవరి 23: తండ్రిని, పిన్నిని మొద‌టి భార్య కొడుకు హ‌త్య చేసిన ఘ‌ట‌న‌ విజయనగరం జిల్లా మండల కేంద్రమైన బొండపల్లి హరిజన కాలనీలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే… బొండపల్లి గ్రామ హరిజన కాలనీకి చెందిన డోల రాము అదే గ్రామానికి చెందిన బొండపల్లి లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు పైడిరాజు, లక్ష్మణ రావు ఇద్ద‌రు కుమారులు. ఈ నేపధ్యంలో మొదటి భార్యతో మనస్పర్ధలు రావడంతో తండ్రి డోల రాము బొండపల్లి మండలం, గిట్టుపల్లి గ్రామానికి చెందిన సూర జయలక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి సుమారు 13ఏళ్ల‌ వయస్సు గల 8వ తరగతి చదువుతున్న కుమార్తె చంద్రిక ఉంది.

కాగా మొదటి భార్య సంతానం అయిన మొదటి కుమారుడు పైడిరాజు విశాఖలో ఉంటున్నాడు. రెండవ కుమారుడైన లక్ష్మణ రావు బొండపల్లి హరిజన కాలనీలో ఉంటున్నాడు. అయితే లక్ష్మణ రావు తండ్రి రాము, పిన్ని జయలక్ష్మితో కాకుండా వేరేగా ఉంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఇవాళ‌ ఉదయం మారణాయుధంతో తండ్రి రాము, పిన్ని జయలక్ష్మిని క్రూరంగా నరికి ఇ౦టి దగ్గర హత్య చేసాడు. తండ్రి రాము, పిన్ని జయలక్ష్మి అకడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం తెలుసుకున్న గజపతినగరం సిఐ.ప్రభాకర్ రావు, బొండపల్లి, గజపతినగరం ఎస్సైలు కె.లక్ష్మణ రావు, మహేష్ లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు లక్ష్మణ రావును అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement