Tuesday, March 26, 2024

వైసీపీ నేత‌ల‌ను రాళ్ల‌తో కొట్టే రోజులొస్తాయి : జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి

గడపగడపకు వైసీపీ నేత‌లు వెళ్తే ప్ర‌జ‌లు రాళ్లతో కొట్టే రోజులు త్వరలో వస్తాయని టీడీపీ నేత జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి చెప్పారు. వైసీపీ ప్ర‌భుత్వంపై జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో పాల‌న‌లో వైసీపీ వైఫల్యం చెందింద‌ని, అందుకే గడపగడపకు తిరుగుతామ‌ని అంటోందన్నారు. ప్రజలు రాళ్లు విసిరే అవ‌కాశం ఉంద‌ని కాబ‌ట్టి వైసీపీ నేతలు జాగ్రత్తగా ఉండాలని ఆయ‌న అన్నారు. ప్ర‌జ‌లు గుడికి వెళ్లేందుకు కూడా అనుమతి తీసుకోవాల్సిన ప‌రిస్థితులూ వ‌స్తాయ‌ని జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి విమ‌ర్శించారు. ఏపీలో శాంతి భద్రతల ప‌రిస్థితి అధ్వానంగా ఉంద‌ని ఆయ‌న చెప్పారు. వైసీపీ నేతల బస్సు యాత్రకు పోలీసులతో భారీ భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేసుకోవాల‌ని ఆయ‌న చుర‌క‌లంటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement