Thursday, May 2, 2024

TDP-JANASENA: ప్రారంభమైన టీడీపీ – జనసేన మేనిఫెస్టో కమిటీ భేటీ

అమరావతి : టీడీపీ-జనసేన మేనిఫెస్టో కమిటీ సమావేశం ప్రారంభమైంది. టీడీపీ కేంద్ర కార్యాలయానికి జనసేన నేతలు, జనసేన మేనిఫెస్టో కమిటీ సభ్యులు వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ లు చేరుకున్నారు. జనసేన నేతలకు టీడీపీ నేతలు యనమల, అశోక్ బాబు, పట్టాభి లు స్వాగతం పలికారు.

ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై టీడీపీ – జనసేన మేనిఫెస్టో కమిటీ తొలి భేటీ ఇది. టీడీపీ ప్రతిపాదిత సూపర్ సిక్స్, జనసేన ప్రతిపాదిత షణ్ముఖ వ్యూహం అంశాలపై మేనిఫెస్టో కమిటీ తొలి భేటీలో చర్చించనున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై టీడీపీ – జనసేన పార్టీలు ప్రాథమిక అవగాహనకు రానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement