Friday, May 3, 2024

వరికి నష్టపరిహారం చెల్లించాలని టీడీపీ డిమాండ్

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన వరి పంటకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తూర్పు గోదావ‌రి జిల్లా పి.గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని అంబాజీపేట ప‌రిధిలో గ‌ల‌ పసుపల్లిలో ఆదివారం వర్షాలకు నేలనంటి కుళ్ళిపోతున్న వరి చేలను మండల టీడీపీ నాయకులు పరిశీలించారు. ఇంతవరకు వ్యవసాయాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించలేదని, నష్టాన్ని నమోదు చేయలేదని పేర్కొన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, తడిసిన ధ్యాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని, నష్టపరిహారం చెల్లించాలని, వచ్చే పంటకు రాయితీపై వరివిత్తనాలు, ఎరువులు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు దంతులూరి శ్రీనురాజు, నాయకులు దువ్వూరి సురేష్, చిన్నం బాల విజయరావు, గంధం వెంకటేశ్వ‌రరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement