Monday, April 29, 2024

AP : లోకేష్ వ్యాఖ్యలతో టీడీపీ కుట్ర ఖరారవుతోంది.. పెద్దిరెడ్డి

రాయలసీమ బ్యూరో, ప్రభన్యూస్ : లోకేష్ ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే దాడి వెనుక టిడిపి కుట్ర ఉందని స్పష్టమవుతుందని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. సి ఎం జగన్ పై జరిగిన దాడి పై ఆదివారం ఆయన స్పందించారు.

- Advertisement -

గతంలో పాదయాత్ర కు గుంటూరు దాటితే ఆదరణ కరువవుతోంది అన్నారని గుర్తు చేస్తూ కృష్ణా జిల్లా ఇంచార్జీ గా ఆ ప్రాంతంలో పాదయాత్ర విజయవంతం చేశామని,మళ్ళీ నేడు బస్సు యాత్రకు అదే స్థాయిలో స్పందన రావడంతో
ప్రతిపక్షాలకు మింగుడుపడటంలేదన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి అంతా నైరాశ్యంలో ఉన్నారన్నారన్నారు. సిద్దం సభలు, బస్సు యాత్ర కు లభిస్తున్న ప్రజాదరణ ను చూసి ఓర్వలేక సిఎం జగన్ పై దాడి చేశారని అన్నారు. లోకేష్ ట్విటర్ లో 2019 లో కోడి కత్తి, 2024 లో రాయి దాడి అని పెట్టిన పోస్ట్ చూస్తే దాడి వెనుక టీడీపీ కుట్ర ఉండని స్పష్టం అవుతోందన్నారు. ఎవరైనా రాయితో దూరం నుండి ప్లాన్ చేసి కొట్టించుకుంటారా ? అని ప్రశ్నిస్తూ అదే రాయిని లోకేష్ కి ఇస్తాం, అదే ప్రాంతంలో బస్సు ఎక్కి ఎవరితో అయినా రాయితో కొట్టించుకోవాలని, అప్పుడు కరెక్ట్ గా ప్లాన్ చేసి రాయితో కొట్టించుకోవడం సాధ్యం అవుతుందో లేదో తెలుస్తుందని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యనించారు. ఒక పార్టీ అధినేత, అందులో ముఖ్యమంత్రి పై దాడి జరిగినప్పుడు ఇలాంటి నీచ వ్యాఖ్యలు చేయడం వారి సభ్యత సంస్కారం ఎంతో తెలుస్తోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement