Thursday, May 2, 2024

Suicide: ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు.. అంత‌లోనే ఆత్మ‌హ‌త్య

కులాలు వేరైనా కలకాలం కలిసుందాం అని మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్నారు. ఎట్టకేలకు పెద్దలను ఒప్పించి కాపురం పెట్టారు. అంత సజావుగా సాగుతుంది అనుకునే లోపే ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలను విడిచారు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాలోకి వెలితే.. ఘటన రామగిరి మండలం గంగంపల్లిలో చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన దాదా (30), జ్యోత్స్న (26)లు కొంతకాలంగా ప్రేమించుకొని మూడు నెలల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుని తిరిగి గ్రామానికి వచ్చారు. ఇరు కుటుంబాల్లో కొద్ది రోజులు స్వల్ప వివాదం నెలకొన్నా.. చివరికి వారిని ఒప్పించి దాదా ఇంట్లోనే ఉంటున్నారు. ఇంతలోనే బుధవారం సాయంత్రం తోటకు వెళ్లి వస్తామని చెప్పిన ఇద్దరు వారి తోటలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement