Sunday, April 28, 2024

TTD: ముచ్చ‌ట‌గా మూడు నిమిషాల్లోనే శ్రీవారి ఆర్జిత సేవ‌ల టిక్కెట్స్ సేల్..

తిరుమల తిరుపతి దేవస్థానం మే నెలకు సంబంధించిన ఆర్జిత సేవ టికెట్లను నేడు విడుదల చేసింది. ఉదయం 10గంటల సమయంలో బుకింగ్స్ మొదలవ్వగా కేవలం 3నిమిషాల్లోనే మొత్తం టికెట్లు బుక్ అయ్యాయి. అలాగే వర్చువల్ సేవలకు సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. అంగ ప్రదక్షణం టోకెన్లను 23న ఉదయం 10గంటలకు, శ్రీవాని ట్రస్ట్ మే నెల టికెట్లను 11గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. మే నెలకు గాను స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను 24న ఉదయం 10గంటలకు, వసతి గదులకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేయనుంది.

ర‌ద్దీ సాధార‌ణం.. 8 గంట‌ల‌లోనే స్వామి వారి ద‌ర్శ‌నం

తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. 13 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండగా 8గంట‌ల్లోనే స్వామి వారి ద‌ర్శ‌న భాగ్యం క‌లుగనుంది. ఇదిలా ఉంటే బుధవారం 69,191మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 29,295 మంది తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో వచ్చిన హుండీ ఆదాయం 3.60కోట్ల రూపాయలుగా నమోదయ్యింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement