Monday, April 29, 2024

AP: 26నుంచి అనంత‌లో జ‌ర్న‌లిస్ట్ ల క్రికెట్ టోర్ని… పోస్ట‌ర్ ను అవిష్క‌రించిన శ్రీల‌క్ష్మీ..

విజ‌య‌వాడ – అనంతపురంలో జరిగే రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్లో వర్కింగ్ జర్నలిస్టులందరూ పాల్గొని ఐకమత్యంతో ముందుకెళ్లాలని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి అన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో అనంతపురంలో ఈనెల 26వ తేదీ నుంచి జరిగే రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్లను విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంలో మంగళవారం ఉదయం శ్రీలక్ష్మి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి తో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ… అనంతపురంలో రాష్ట్రస్థాయి జర్నలిస్టు క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంట్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. నిత్యం పని ఒత్తిడితో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులకు రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాల్లో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ టోర్నమెంట్ నిర్వహించడం ఒక రికార్డ్ అని అన్నారు. ఇందులో వర్కింగ్ జర్నలిస్టులందరూ పాల్గొని విజయవంతం చేయాలని, ఈ టోర్నీ జర్నలిస్టుల ఆటవిడుపుకి కూడా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ తిరుపతి నగేష్, డి.రాజగోపాల్, అనంతపురం జిల్లా అధ్యక్షులు వెంకటేష్, తిరుపతి జిల్లా నాయకుడు వెంకటేష్, ఇతర సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement