Wednesday, March 27, 2024

శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రత్యర్థులు ఇద్దరు మహిళలపై దాష్టీకానికి ఒడిగట్టారు. ఇద్దరు మహిళలపై ట్రాక్టర్ తో కంకర మట్టి వేశారు. గమనించిన స్థానికులు మట్టిని తొలగించి మహిళలను కాపాడారు. హరిపురం గ్రామానికి చెందిన ఆనందరావు, ప్రకాశ్ రావు, రామారావులు తమ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి తమను, తమ స్థలాన్ని కాపాడాలని కోరుతున్నారు. ఆనందరావు, ప్రకాశ్ రావు, రామారావులపై చర్యలు తీసుకోవాలని వేడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement