Friday, May 3, 2024

ఇచ్ఛాపురం చైర్ పర్సన్ గా పిలక రాజ్యలక్ష్మి

ఇచ్ఛాపురం , మున్సిపల్ చైర్ పర్సన్ గా వైసిపికి చెందిన‌ పిలక రాజ్యలక్ష్మి ఎన్నికయ్యారు. వైఎస్ చైర్ పర్సన్ గా ఉలాల భారతి దివ్యను ఎన్నుకున్నారు.. అంత‌కు ముందు కౌన్సిల్ హాల‌లో కొత్త‌గా ఎన్నికైన స‌భ్యుల‌తో ప్రిసైడింగ్ అధికారి కిషోర్ ప్ర‌మాణ స్వీకారం చేయించారు.. అనంత‌రం చైర్మ‌న్, డిప్యూటీ చైర్మ‌న్ పోస్ట్ ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించారు..ఆయా పోస్ట్ ల‌కు రాజ్య‌ల‌క్ష్మీ, భార‌తి దివ్య‌లు మాత్ర‌మే నామినేష‌న్ లు వేశారు.. దీంతో వారి ఎన్నిక ఏక‌గ్రీవ‌మైంది.. కొత్త‌గా ఎన్నికైన వారిని వైసిపి నేత‌లు అభినందించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement