Sunday, April 28, 2024

Breaking: తల్లిదండ్రులపై కొడుకు దాడి… తండ్రి మృతి, తల్లి పరిస్థితి విషమం

తల్లిదండ్రులపై కొడుకు దాడి చేయడంతో.. దాడిలో తండ్రి మృతిచెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు పరిధిలోని పిడుగురాళ్లలో చోటుచేసుకుంది. ఈ దాడిలో తండ్రి అక్కడికక్కడే మృతిచెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉంది.

తల్లిని సమీపంలోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కొడుకు ఆస్తి కోసమే తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డాడని స్థానికులు పేర్కొంటున్నారు. ఆస్తి విషయంలో తల్లిదండ్రులు, కొడుకు మధ్య మాటామాటా పెరగడంతో కొడుకు తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డాడని స్థానికులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement