Monday, May 6, 2024

Eluru: డబ్బులివ్వలేదని.. తల్లి, చెల్లిపై కత్తిపీటతో దాడిచేసిన కొడుకు

ఏలూరు, ప్రభ న్యూస్ క్రైమ్ : ఏలూరు జిల్లా తాటాకులగూడెం మండలంలో దారుణం జరిగింది. వ్యసనాలకు బానిసైన కొడుకు తల్లిని డబ్బులు అడుగుగా.. లేవని చెప్పడంతో.. తల్లిపై కత్తిపీటతో దాడి చేస్తుండడంతో చెల్లి అడ్డు రావడంతో ఇద్దరిపై దాడి చేశాడు. తల్లి కూతుర్లు తీవ్ర గాయాలు పాలయ్యారు.

గాయాలపాలైన వీరిని 108 వాహనంలో ఏలూరు జిల్లా సర్వేజన ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నారు. తల్లి చిన్ని వద్ద నుండి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement